కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన సచిన్ టెండూల్కర్
- July 28, 2018
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ పలువురు సెలబ్రిటీలకు మూడు మొక్కల చొప్పున నాటాలని ఛాలెంజ్ విసిరారు.అందులో ప్రముఖ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. కాగా మంత్రి విసిరినా ఛాలెంజ్ ను స్వీకరించారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ మేరకు మొక్కలు నాటుతూ.. మంత్రి కేటీఆర్ కు రీట్వీట్ చేశారు.. ‘గ్రీన్ ఛాలెంజ్ కోసం నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ సవాలు నేను స్వీకరిస్తున్నాను.. గ్రీనర్ ప్లానెట్ మన చేతుల్లో ఉంది’ అంటూ మాస్టర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఐదుగురికి నామినేట్ చేయాలంటూ సచిన్ కు సూచించారు.
తాజా వార్తలు
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!









