నేటి నుంచి హజ్ యాత్ర ప్రారంభం

- July 31, 2018 , by Maagulf
నేటి నుంచి హజ్ యాత్ర ప్రారంభం

హజ్ యాత్ర 2018 నేటి నుంచి ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన 8వేల మంది యాత్రికులు ఈరోజు నుంచి 15 వరకు 25 ప్రత్యేక విమానాల్లో హజ్ యాత్రకు వెళ్తున్నారని హజ్ కమిటీ ప్రత్యేకాధికారి తెలిపారు. తొలివిడతగా ఈ నెల 9వరకు తెలంగాణ యాత్రికులు, 10 వ తేదీ నుంచి 14 వరకు ఏపీ యాత్రికులు,15వ తేదిన కర్ణాటక యాత్రికులు హజ్ కు బయలుదేరి వెళ్తారు. హజ్ హౌస్ నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లి విమానాల ద్వారా సౌదీ అరేబియా జెడ్డాకు యాత్రికులను చేరవేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. లగేజ్, బోర్డింగ్, ఇమిగ్రేషన్, కస్టమ్స్ తదితర అన్ని ప్రక్రియల కౌంటర్లను హజ్ హౌస్ లోనే ఏర్పాటు చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com