నేటి నుంచి యూఏఈలో క్షమాభిక్ష
- July 31, 2018
యూఏఈ:ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి.. ఖల్లివల్లి అయిన వలసకార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం సదవకాశం కల్పించింది. వీసా, వర్క్ పర్మిట్లేకుండా అక్రమంగా ఉంటున్న (ఖల్లివల్లి) కార్మికుల నుంచి జరిమానాలు వసూలు చేయకుండా, జైలుశిక్ష విధించకుండా స్వదేశాలకు పం పించనున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి అక్టోబ ర్ 31 వరకు క్షమాభిక్షను అమలుచేయనున్నట్టు వెల్లడించింది. 2013లో రెండునెలలపాటు క్షమాభిక్షను అమలుచేసిన యూఏఈ ప్రభుత్వం, ఐదేండ్ల తర్వాత మూడునెలలు క్షమాభిక్ష ప్రకటించడం గమనార్హం. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ వయా రెక్టిఫై యువర్ స్టేటస్ అనే కార్యక్రమం పేరిట క్షమాభిక్షను అమలుచేయనున్నది. యూఏఈలో సుమారు 20 వేల మంది తెలంగాణ కార్మికులు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సుమారు 5 వేల మంది ఖల్లివల్లి అయి ఉంటారని అంచనా. ఖల్లివల్లి కార్మికులకు అక్కడి చట్టాల ప్రకారం భారీ జరిమానాలు, జైలు శిక్ష విధిస్తుంటారు. దీంతో అనేకమంది స్వదేశాలకు చేరుకోలేక అక్కడి జైళ్లలోనే మగ్గుతూ ఉంటారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కార్ కృషి చేస్తున్నది.
ఇరు రాష్ట్రాల మంత్రులు వలసకార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పడు గల్ఫ్ దేశాలతో సంప్రదింపులను కూడా జరుపుతున్నారు. తాజాగా యూఏఈ దేశాల్లో ఉన్నవారిని గుర్తించి స్వదేశానికి తీసుకొచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..