నేటి నుంచి యూఏఈలో క్షమాభిక్ష
- July 31, 2018
యూఏఈ:ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి.. ఖల్లివల్లి అయిన వలసకార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం సదవకాశం కల్పించింది. వీసా, వర్క్ పర్మిట్లేకుండా అక్రమంగా ఉంటున్న (ఖల్లివల్లి) కార్మికుల నుంచి జరిమానాలు వసూలు చేయకుండా, జైలుశిక్ష విధించకుండా స్వదేశాలకు పం పించనున్నట్టు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి అక్టోబ ర్ 31 వరకు క్షమాభిక్షను అమలుచేయనున్నట్టు వెల్లడించింది. 2013లో రెండునెలలపాటు క్షమాభిక్షను అమలుచేసిన యూఏఈ ప్రభుత్వం, ఐదేండ్ల తర్వాత మూడునెలలు క్షమాభిక్ష ప్రకటించడం గమనార్హం. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ వయా రెక్టిఫై యువర్ స్టేటస్ అనే కార్యక్రమం పేరిట క్షమాభిక్షను అమలుచేయనున్నది. యూఏఈలో సుమారు 20 వేల మంది తెలంగాణ కార్మికులు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సుమారు 5 వేల మంది ఖల్లివల్లి అయి ఉంటారని అంచనా. ఖల్లివల్లి కార్మికులకు అక్కడి చట్టాల ప్రకారం భారీ జరిమానాలు, జైలు శిక్ష విధిస్తుంటారు. దీంతో అనేకమంది స్వదేశాలకు చేరుకోలేక అక్కడి జైళ్లలోనే మగ్గుతూ ఉంటారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కార్ కృషి చేస్తున్నది.
ఇరు రాష్ట్రాల మంత్రులు వలసకార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పడు గల్ఫ్ దేశాలతో సంప్రదింపులను కూడా జరుపుతున్నారు. తాజాగా యూఏఈ దేశాల్లో ఉన్నవారిని గుర్తించి స్వదేశానికి తీసుకొచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







