విజయవాడ:రేపు ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డే
- August 01, 2018
విజయవాడ: ఏఈసీసీ గ్లోబల్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ తేదీన ఎంజీ రోడ్డులోని ఫార్చ్యూన్ మురళీ పార్కు హోటల్లో ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఏఈసీసీ ఏపీ బిజినెస్ హెడ్ చైతన్య వాడపల్లి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి 20 విశ్వవిద్యాలయాలు పాల్గొంటాయని తెలిపారు. ఒకే రోజు వారందరినీ విద్యార్థులు కలుసుకుని వారి స్పాట్ అసెస్మెంట్, ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్స్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎటువంటి రుసుములు, ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా నిర్వహించే ఈ సమ్మిట్లో క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ పాల్గొంటారని పేర్కొన్నారు. అర్హులైన, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 89787 87855 నెంబర్ను సంప్రదించాలన్నారు.
తాజా వార్తలు
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్లో కొత్త అప్డేట్..
- కువైట్లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!







