మెడిసిన్ సీట్లు ఇప్పిస్తానంటూ మోసాలు
- August 01, 2018హైదరాబాద్ : మెడిసిన్ సీట్లు ఇప్పిస్తానంటూ దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డ సంతోష్రాయ్ని బెంగళూర్ పోలీసులు పీటీ వారెంట్పై కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే బెంగళూరు పోలీసులు ముందుగా 10 కేసులే అనుకున్నా.. విచారణ అనంతరం బెంగుళూర్లో 22 మందిని రూ. 30 కోట్ల వరకు మోసం చేసినట్లు తేలింది. దీంతో సంతోష్రాయ్ మోసాల చిట్టా మరింతగా పెరుగుతూ పోతుంది. దేశ వ్యాప్తం గా రూ. 100 కోట్లకుపైగానే వివిధ రకాలుగా సంతోష్రాయ్ మోసాలు చేసి ఉంటాడని పోలీసులు బావిస్తున్నారు. ఎంబీబీఎస్, ఎండీ సీట్లు ఇప్పిస్తానంటూ నమ్మించి ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు తీసుకొని దేశ వ్యాప్తంగా కోట్ల రూపాయలు ముంచేసిన సంతోష్, మనోజ్లను గత నెలలో సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
సంతోష్రాయ్ 20 ఏండ్లుగా మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడయింది. సంతోష్రాయ్కు చెందిన బాధితులు దేశ వ్యాప్తంగా ఉన్నారు. హైదరాబాద్లో నమోదయిన ఒక్క కేసులో సైబర్క్రైమ్ పోలీసులు ఢిల్లీలో నిందితుడి కోసం గాలింపు చేపట్టి ఈ కరుడు గట్టిన చీటర్ను అరెస్ట్ చేశారు. ఇతనిని కోర్టు అనుమతితో 7 రోజుల పాటు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు విచారించగా నకిలీ వైద్య శాలను ఏర్పాటు చేయడం నుంచి నకిలీ సీబీఐ ఆఫీసర్గా బెదిరింపులకు పాల్పడిన ఎన్నో విషయాలు ఈ విచారణలో బయట పడ్డాయి. హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల కస్టడీ ముగిసిన అనంతరం, ప్రధా న నిందితుడైన సంతోష్రాయ్ని బెంగళూర్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
ఇతనిపై ఉన్న కేసులలో విచారణ చేస్తున్న క్రమంలో బెంగుళూర్లో మరింత మందిని మోసం చేసినట్లు వెల్లడయింది. మొత్తం 22 మందిని మోసం చేసినట్లు బెంగుళూరు పోలీసులు లెక్కలు తేల్చారు. ఇతనిపై ముంబాయి లో 7 కేసులు నమోదయి ఉన్నాయి. ఇదిలాఉండగా హైదరాబాద్ సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు మరో సారి ఈ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లి మరింత లోతైనా దర్యాప్తు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు