రోడ్డు ప్రమాదం: ఐదుగురు వలసదారుల మృతి

- August 01, 2018 , by Maagulf
రోడ్డు ప్రమాదం: ఐదుగురు వలసదారుల మృతి

మస్కట్‌: అల్‌ దహిరాహ్‌ గవర్నరేట్‌ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డార. హమ్రా అల్‌ డ్రోరా వైపు వెళుతున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురయ్యిందని రాయల్‌ ఒమన్‌ పోలీసులు చెప్పారు. మృతులు ఒమన్‌ జాతీయులుగా గుర్తించారు. ఘటన గురించి సమాచారం అందుకోగానే పెట్రోల్‌, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాఉ. వాహనదారులు తమ వాహన కండిషన్‌పై ఖచ్చితమైన అవగాహనలో వుండాలనీ, వేగ నియంత్రణ పాటించాలనీ, బ్రేక్‌లు టైర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com