కోసం కొత్త సెట్ రెడీ చేసిన సైరా బృందం
- August 06, 2018
'సైరా' సినిమా సెట్ను షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు కూల్చి వేయడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ చర్యపై చిత్రబృందం ఎవ్వరు కూడా స్పందించకపోవడం కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సైలైంట్ గా చిత్రబృందం కొత్త సెట్ ని రెడీ చేసుకొనే పనిలో పడింది. ఇప్పుడా పని పూర్తయినట్టు సమాచారం.
కొత్త సెట్ లో రేపటి నుంచి షెడ్యూల్ మొదలుకానుంది. ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ఏకధాటిగా నెలరోజుల పాటు షూటింగ్ నిర్వహించనున్నారు. బ్రిటిషర్స్, నరసింహారెడ్డి మధ్య సాగే సన్నివేశాలు, ఫైట్స్ చిత్రీకరిస్తారని సమాచారం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మిస్తున్నారు.
ఇక, ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







