ప్రవాసులు స.హ.చ దరఖాస్తుకు అనర్హులు:జితేంద్రసింగ్
- August 08, 2018
ఢిల్లీ: సాధారణంగా ప్రభుత్వ పాలనా యంత్రాంగం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏదైనా సమాచారం కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రవాసులకు ఆ వెసులుబాటు లేదని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ లోక్సభకు ఇచ్చిన లిఖిత్వ పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 'సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం.. కేవలం భారతీయ పౌరులకు మాత్రమే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకునే హక్కు ఉంటుంది. ప్రవాసులకు ఇందుకు అర్హులు కారు' అని జితేంద్రసింగ్ తెలిపారు. అంతేగాక.. సహచట్టం ద్వారా సమాచారం పొందాలనుకునే వారికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉందని వెల్లడించారు. www.rtionline.gov.in వెబ్సైట్కు వెళ్లి అందులోని కావాల్సిన మంత్రిత్వ శాఖ లేదా ప్రభుత్వ విభాగాన్ని ఎంపిక చేసుకుని దరఖాస్తును నింపొచ్చని జితేంద్రసింగ్ తెలిపారు. ప్రస్తుతం 2,200 ప్రభుత్వ విభాగాల వద్ద ఈ ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించే వ్యవస్థ ఉందని చెప్పారు. ఈ దరఖాస్తులకు రుసుము కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని కేంద్రమంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







