మక్కా లో మృతిచెందిన హజ్ యాత్రికురాలు

- August 08, 2018 , by Maagulf
మక్కా లో మృతిచెందిన హజ్ యాత్రికురాలు

హైదరాబాద్‌: ఇటీవల హజ్‌ యాత్రకు వెళ్లిన ఓ వృద్ధురాలు మక్కాలో మృతి చెందినట్టు తెలంగాణ హజ్‌ కమిటీ ప్రకటించింది. పాతబస్తీ మొగల్‌పురా, సుల్తాన్‌షాహీ ప్రాంతానికి చెందిన హఫీజాబీ (70) ఈనెల 1న తన కుమారుడు అంజదుద్దీన్‌ బేగ్‌తో కలిసి హజ్‌ యాత్రికుల కోసం వెళ్లిన తొలి విమానంలో బయలుదేరారు. మంగళవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడాన్ని గమనించి ఆమెను సౌదీ అరేబియా, మక్కా నగరంలోని అల్‌నూర్‌ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మృతి చెందారు. సాయంత్రం మక్కాలోని స్థానిక శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com