మక్కా లో మృతిచెందిన హజ్ యాత్రికురాలు
- August 08, 2018
హైదరాబాద్: ఇటీవల హజ్ యాత్రకు వెళ్లిన ఓ వృద్ధురాలు మక్కాలో మృతి చెందినట్టు తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. పాతబస్తీ మొగల్పురా, సుల్తాన్షాహీ ప్రాంతానికి చెందిన హఫీజాబీ (70) ఈనెల 1న తన కుమారుడు అంజదుద్దీన్ బేగ్తో కలిసి హజ్ యాత్రికుల కోసం వెళ్లిన తొలి విమానంలో బయలుదేరారు. మంగళవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడాన్ని గమనించి ఆమెను సౌదీ అరేబియా, మక్కా నగరంలోని అల్నూర్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మృతి చెందారు. సాయంత్రం మక్కాలోని స్థానిక శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







