ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవిగా రకూల్ ప్రీత్ సింగ్!
- August 09, 2018
క్రిష్ దర్శకత్వంలో వస్తున్న 'ఎన్టీఆర్'బయోపిక్ రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో ని ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను, మోహన్ బాబును ఎంపిక చేశారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో రకూల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తుందని ఆ మద్య వార్తలు వచ్చాయి. కానీ దర్శకులు క్రిష్ మాత్రం అవన్నీ కొట్టి పడేశారు. కానీ ఇప్పుడు ఒక్కో క్యారెక్టర్ రివీల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తుండగా శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ కనిపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపించింది. శ్రీదేవి పాత్రకి ఆమె ఎంపిక ఖరారైపోయిందనేది తాజా సమాచారం. ఎన్టీఆర్ .. శ్రీదేవి కలిసి నటించిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందువలన ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రకి కూడా స్థానం వుంది.
ఈ పాత్ర కోసమే రకుల్ ను సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయాయట. ఇక మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించబోతుంది. ఎన్టీఆర్ సీనీ కెరీర్ లో ఎక్కువ చిత్రాలు సావిత్రి, శ్రీదేవిలతో నటించిన విషయం తెలిసిందే.. అందుకే ఆ పాత్రలకు ఎంతో ప్రాధాన్య ఇస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







