దసరా కానుకగా 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి'
- August 10, 2018
తెలుగు,తమిళ, మలయాళ కన్నడ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది రాయ్ లక్ష్మి. అయితే తెలుగు లో కొన్ని చిత్రాల్లో నటించినా రాయ్లక్ష్మీ కి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ మద్య బాలీవుడ్ లో 'జూలి 2'చిత్రంలో నటించింది కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. వివివినాయక్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' చిత్రంలో 'రత్తాలు రత్తాలు' సాంగ్ లో హాట్ హాట్ గా దర్శనమిచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది.
తెలుగు లో చాలా గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు తాజాగా 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' తో మరోసారి తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయబోతుంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంతోనే కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ కీలక పాత్రధారులు. పూజిత పొన్నాడ ప్రత్యేక పాత్రలో నటించనుంది. హరి గౌర వేర్ సంగీతం అందిస్తున్నాడు.తాటవర్తి కిరణ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబీటి క్రియేషన్స్ సంస్థపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజిత పొన్నాడ, కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా సీజన్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాయ్ లక్ష్మి .. వెంకటలక్ష్మిగా ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







