దసరా కానుకగా 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి'
- August 10, 2018
తెలుగు,తమిళ, మలయాళ కన్నడ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది రాయ్ లక్ష్మి. అయితే తెలుగు లో కొన్ని చిత్రాల్లో నటించినా రాయ్లక్ష్మీ కి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ మద్య బాలీవుడ్ లో 'జూలి 2'చిత్రంలో నటించింది కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. వివివినాయక్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' చిత్రంలో 'రత్తాలు రత్తాలు' సాంగ్ లో హాట్ హాట్ గా దర్శనమిచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది.
తెలుగు లో చాలా గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు తాజాగా 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' తో మరోసారి తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయబోతుంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంతోనే కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ కీలక పాత్రధారులు. పూజిత పొన్నాడ ప్రత్యేక పాత్రలో నటించనుంది. హరి గౌర వేర్ సంగీతం అందిస్తున్నాడు.తాటవర్తి కిరణ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబీటి క్రియేషన్స్ సంస్థపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజిత పొన్నాడ, కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా సీజన్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాయ్ లక్ష్మి .. వెంకటలక్ష్మిగా ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







