మనామా:లిక్కర్ స్మగ్లర్స్ అప్పీల్ని తిరస్కరించిన న్యాయస్థానం
- August 10, 2018
మనామా:200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన ఆల్కహాల్ని స్మగ్లింగ్ చేసిన కేసులో 14 మందికి జైలు శిక్ష విధించగా, వారి అప్పీల్ని న్యాయస్థానం తాజాగా తిరస్కరించింది. నిందితులంతా ఆసియా జాతీయులే. వీరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ కేసుకి సంబంధించి మొత్తం 21 మంది అనుమానితులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురికి మూడు నెలల జైలు శిక్ష పడగా, వీరెవరూ తమ శిక్షను అప్పీల్ చేయడానికి ముందుకు రాలేదు. షిప్లో అక్రమంగా మద్యం బాటిళ్ళను దాచి, బహ్రెయిన్లోకి స్మగుల్ చేస్తుండగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన మద్యంతోపాటుగా, 36,000 బహ్రెయినీ దినార్స్ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







