క్యాన్సర్తో కన్నుమూసిన చిన్నారికి ఘన నివాళి
- August 10, 2018
సౌదీ అరేబియా:సౌదీలో ఓ చిన్నారి క్యాన్సర్తో కన్నుమూసింది. ఆ బాలిక వైద్య చికిత్స పొందుతుండగా, ఆ సమయంలో తీసిన ఫొటోల్ని, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వుండేది. అలా ఆమె అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యింది. క్యాన్సర్తో పోరాడే క్రమంలో ఆమె చూపిన తెగువను అందరూ అభినందించేవారు. దురదృష్టవవాత్తూ ఆమె ఆగస్ట్ 8న మృతి చెందింది. దాంతో అరబ్ సమాజం అంతా ఆ బాలిక మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆమె మరణం గురించిన తెలిసిన తర్వాత, ఆ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. సౌదీ అరేబియా, కువైట్ సహా పలు అరబ్ దేశాల్లో ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈజిప్టియన్ కమెడియన్, నటుడు మొహమ్మద్ హెనెడీ స్పందిస్తూ, సాధారణ జ్వరానికే ఓ వ్యక్తి బెడ్ మీద కదల్లేని స్థితికి వెళ్ళిపోతాడనీ, అలాంటిది నవాల్ అల్ ఘామ్డి అనే ఓ బాలిక, క్యాన్సర్ని జయించేందుకు చాలా పోరాడిందనీ, ఎప్పుడూ ఆమె మోము మీద చిరునవ్వే కన్పించేదనీ, ఆ నవ్వు ఎప్పటికీ అలాగే మనకు గుర్తుండిపోతుందనీ అన్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









