ఎయిర్ ఇండియా విమాన పైలెట్ల ఆందోళన...
- August 10, 2018
న్యూఢిల్లి: జూలైలో జీతాలు చెల్లించని ఉద్యోగుల నుంచి ఒత్తిడిని అధిగమించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయాలు మొదలుపెట్టింది.ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా శుక్రవారం సిబ్బందికి నోటీసు జారీ చేసింది, ఇందులో ఆగస్టు 13 కంతా మొత్తం జీతాలు చెల్లిస్తాం అని పేర్కొంది.
జీతాలు చెల్లించనందుకు విచారం వ్యక్తం చేస్తూ ఎయిర్ ఇండియా తన సిబ్బంది నోటీసులో చెల్లింపులు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియజేసింది. యాజమాన్యం నియంత్రణకు మించి ఉన్న పరిస్థితులు కారణంగా జూలై 2018 లో జీతాలు చెల్లించడంలో ఆలస్యం జరిగిందని ఇందుకు తాము చాల చింతిస్తున్నాం అన్నారు అయితే, వచ్చే వారం నాటికి చెల్లింపులు చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఎయిర్ ఇండియాకు 11,000 కన్నా ఎక్కువ శాశ్వత సిబ్బంది ఉన్నారు.గత మార్చి నుండి వేతనాలు నెల నెలా చెల్లించడంలో ఆలస్యం జరుగుతోంది.సాధారణంగా, ఎయిర్లైన్స్ ప్రతి నెల 30 లేదా 31వ తేదిలకంతా వేతనాలు చెల్లిస్తుంది.
ఈక్విటీలో ఇన్ఫ్యూషన్కు సప్లిమెంటరీ గ్రాంట్లుగా రూ .980 కోట్లు అందించేందుకు పార్లమెంటు ఆమోదం తెలపాలని ప్రభుత్వం కోరింది. జూలై 26 న సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్సభలో మాట్లాడుతూ, మేలో జీతాలు చెల్లించడంలో కొంత ఆలస్యం అయిందని, తదనంతరం చెల్లించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







