మణిరత్నం 'నవాబ్' సినిమా
- August 18, 2018
మణిరత్నం లేటెస్ట్ చిత్రం 'సెక్క సివంద వానం'. తెలుగులో 'నవాబ్' పేరుతో విడుదల కానుంది. ఇందులో శింబు, విజయ్సేతుపతి, అరవింద్స్వామి, అరుణ్విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్ తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఒక నవల ఆదరంగా తెరకేక్కుతుందని టాక్ .
దుర్యోధనుడు, కర్ణుడి స్నేహం ఇతివృత్తంగా రజనీ- మమ్ముట్టిలతో 'తలబది'(దళపతి), అంబాని జీవితంతో 'గురు', ఎంజీఆర్, కరుణానిధి జీవిత ఘట్టాల ఆధారంగా ప్రకాశ్రాజ్, మోహన్లాల్ నటించిన 'ఇరువర్'(ఇద్దరు) వంటి చిత్రాలను రూపొందించారు మణిరత్నం. ఇప్పుడు కూడా ఆయన 'పొన్నియిన్ సెల్వం' అనే చారిత్రాత్మక నవల ఆధారంగా 'సెక్క సివంద వానం' సినిమాను రూపొందిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా మణిరత్నం ఇప్పుడు మునపటి ఫాం లో లేరు. ఓకే బంగారం తర్వాత కార్తీతో మణిరత్నం తీసిన సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. 'చెక్క చివంత వానం' పేరుతో తమిళంలో, 'నవాబ్' పేరుతో తెలుగులో రాబోతున్న సినిమాకు విడుదల తేదీని కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదల కాబోతోందని లైకా ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







