యూఏఈ:కేరళ కోసం ఎమర్జెన్సీకమిటీ
- August 18, 2018
యూఏఈ:యూఏఈ అభివృద్ధిలో కేరళ ప్రజల భాగస్వామ్యం ఉందని, ఆ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన ప్రత్యేక బాధ్యత తమపై ఉందని యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయద్ అలీ నహ్యాన్ అన్నారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు జాతీయ స్థాయిలో ఓ ఎమర్జిన్సీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా ఎమిరేట్స్ రెడ్ క్రాస్ క్రెసెంట్ (ఈఆర్సీ) ఉంటుందని, ఇందులో పలు ఎన్జీవోలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ ఆపద సమయంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఎమిరేట్స్ ప్రజలు, ప్రవాస భారతీయులు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేరళలో ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేని వర్షాలు కురుస్తున్నాయి. బక్రీద్ జరుపుకోవాల్సిన సమయంలో ఇలాంటి ఘోరవిపత్తు వచ్చిందని, ఇలాంటి సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి