యూఏఈ:కేరళ కోసం ఎమర్జెన్సీకమిటీ
- August 18, 2018
యూఏఈ:యూఏఈ అభివృద్ధిలో కేరళ ప్రజల భాగస్వామ్యం ఉందని, ఆ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన ప్రత్యేక బాధ్యత తమపై ఉందని యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయద్ అలీ నహ్యాన్ అన్నారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు జాతీయ స్థాయిలో ఓ ఎమర్జిన్సీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కమిటీకి ఛైర్మన్ గా ఎమిరేట్స్ రెడ్ క్రాస్ క్రెసెంట్ (ఈఆర్సీ) ఉంటుందని, ఇందులో పలు ఎన్జీవోలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ ఆపద సమయంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఎమిరేట్స్ ప్రజలు, ప్రవాస భారతీయులు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేరళలో ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేని వర్షాలు కురుస్తున్నాయి. బక్రీద్ జరుపుకోవాల్సిన సమయంలో ఇలాంటి ఘోరవిపత్తు వచ్చిందని, ఇలాంటి సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







