కొచ్చి ఎయిర్పోర్ట్ లో సేవలు పునప్రారంభం
- August 19, 2018తిరువనంతపురం : కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుండి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. నావికాదళ ఎయిర్స్టేషన్లో విమాన కార్యకలాపాలను కేంద్రం, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఉమ్మడి బృందం నిర్ణయించిందని కమాండర్ శ్రీధర్ వారియర్ వెల్లడించారు. నావికా ఎయిర్స్టేషన్ వద్ద మొట్టమొదటి విమానం ఐఎన్ఎస్ గరుడా విమానం ల్యాండ్ అయింది. బెంగుళూరు నుండి 70 సీట్లతో కూడిన ఎయిర్ఇండియా అనుబంధ సంస్థకు చెందిన ఎలైన్స్ ఎయిర్ విమానం కొచ్చిలో ల్యాండ్ అయినట్లు తెలిపారు. మధురై, కోయంబత్తూర్ల నుండి త్వరలో సేవలను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. విమానం గతంలో విమానాశ్రయం కూడా నీటిలో మునిగిపోవడంతో ఆగస్ట్ 26 వరకు కార్యక్రమాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వర్షపాతం గత మూడు రోజుల నుండి క్రమంగా తగ్గుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. శిబిరాలలో ఉన్నవారికి ఆహారంతో పాటు మందులను అందించేందుకు సహాయక బృందాలు సమాయత్తమౌతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా