రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా పలువురు నివాళులు

- August 20, 2018 , by Maagulf
రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా పలువురు నివాళులు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం వీర్‌భూమిలోని ఆయన స్మృతి చిహ్నానికి నివాళులు అర్పించారు. వీరితో పాటు ప్రియాంక గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్‌గాంధీ దేశానికి ఆరవ ప్రధానిగా 1984నుండి 1989 వరకు భాద్యతలు చేపట్టారు. 1991లో మే 21న తమిళనాడుకు చెందిన ఆత్మాహుతి దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌లు కూడా నివాళులు అర్పించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com