తాలిబన్ల నిర్బంధంలో 100మంది ప్రయాణికులు
- August 20, 2018
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర ప్రాంతంలో 100మందిని తాలిబన్లు నిర్బంధించినట్లు అధికారులు తెలిపారు. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈద్ అల్ అదా రోజున తాలిబన్లతో కాల్పుల విరమణ కోసం అధ్యక్షుడు అష్రఫ్ ఘానీ పిలుపున్విడాన్ని వ్యతిరేకిస్తూ తాలిబన్లు ఈ ఘాతుకానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఖుండాజ్ ప్రాంతానికి చెందిన కౌన్సిల్ అధికారి మొహమ్మద్ యుసుఫ్ ఆయుబి మాట్లాడుతూ సోమవారం ఖాన్ అబాడ్ జిల్లాలోని మూడు బస్సులను ఆపి అందులోని ప్రయాణికులను అపహరించినట్లు తెలిపారు. టాక్తార్ ప్రాంతానికి చెందిన వారు కాబూల్కు వెళ్లేందుకు ఆబస్సులలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. అయితే దీనిపై తాలిబన్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే ఆప్రాంతమంతా తాలిబన్ల నియంత్రణలోనే ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







