టాలీవుడ్ టాప్ డైరెక్టర్లకు భారీ ఆఫర్ ప్రకటించిన నిఖిల్ గౌడ..
- August 25, 2018
'జాగ్వార్' చిత్రం తో వెండి తెరకు పరిచమైన కర్ణాటక సిఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ..మొదటి సినిమా ఫై భారీ ఆశలే పెట్టుకొని , భారీ ఖర్చే చేసారు కానీ సినిమా మాత్రం అనుకున్న రీతిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లకు భారీ ఆఫర్ ప్రకటించాడు.
తనను హీరోగా నిలబెట్టే మంచి కథతో ఎవరైనా స్టార్ డైరెక్టర్ వస్తే ఆయనకు 5 కోట్ల రూపాయల చెక్ అందించేందుకు రెడీగా ఉన్నట్టు ప్రకటించాడు. ఈ ఆఫర్ కేవలం టాలీవుడ్ కు మాత్రమే అని చెప్పడం కోసం మెరుపు. ఈయన కు కన్నడ చిత్రసీమలో ఎలాంటి ఇబ్బందిలేదు. కానీ తెలుగులో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకే ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. మరి నిఖిల్ ఆఫర్ ను అంగీకరించే దర్శకుడు మాత్రం టాలీవుడ్ లో ప్రస్తుతం కనిపించడం లేదు. ఎందుకంటే టాప్ డైరెక్టర్లంతా వరుస సినిమాలతో రెండేళ్ల పాటు బిజీ గా ఉన్నారు. మరి రూ. 5 కోట్ల కోసం ఎవరైనా ముందుకు వస్తారనేది చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







