అందాన్ని పెంచే పండ్లు ఇవే...
- August 27, 2018
సామాన్యంగా స్త్రీలు అందం అంటే ఎక్కువుగా ఆసక్తి చూపుతారు. దానికోసం రకరకాల ఫేస్ ప్యాక్లను, క్రీంలను వాడుతుంటారు. కేవలం వీటినే కాకుండా మనం తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం వలన కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. కొంతమందికి కాలుష్యం, ఎండ బారిన పడటం వలన చర్మం కమిలిపోవడం, తెల్లని మచ్చలు రావడం, గరుకుగా తయారవడం జరుగుతుంది. ఇలాంటి దుష్ప్రభావాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలి. అవి ఏమిటో చూద్దాం.
1. బొప్పాయి, అరటి, జామ, ఆపిల్ వంటి పండ్లను ఎక్కువుగా తీసుకోవాలి.
2. ఎక్కువసార్లు మంచినీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి.
3. నిమ్మ, ఉసిరి లాంటి పుల్లటి పండ్లను ఎక్కువుగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.
4. రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది.
5. ఎక్కువుగా పండ్ల రసాలను తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
6. నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తీసుకుంటే చర్మం పొడిబారదు.
7. తేనెను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.
8. కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్ధన చేసుకోవాలి.
9. కలబందను కొన్ని రోజులపాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనపడుతుంది.
10. టీ స్పూన్ కీరా జ్యూస్లో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







