జింబాబ్వే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఎమెర్సన్ మనంగఁగ్వా
- August 27, 2018
హరారే: జింబాబ్వే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమర్సన్ మంగాగ్వే ఆదివారం నాడు అధికార బాధ్యతలను స్వీకరించారు. ప్రధానన్యాయమూర్తి లూక్ మలాబా ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారిగా దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మంగగ్వా తాను దేశ రాజ్యాంగానికి, ఇతర చట్టాలకు కట్టుబడి, విశ్వాసపాత్రుడిగా దేశానికి సేవలందిస్తానని ప్రమాణం చేశారు. మంగగ్వా ఎన్నికను సవాలు చేస్తూ ప్రతిపక్ష నేత నెల్సన్ చమిసా దాఖలు చేసిన పిటిషన్ను రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసిన తరువాత మంగగ్వా ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. గత నెల 30న జరిగిన ఎన్నికల్లో మంగగ్వాకు 50.67 శాతం ఓట్లు, ప్రత్యర్థి చమిసాకు 44.3 శాతం ఓట్లు లభించాయని జింబాబ్వే ఎన్నికల కమిషన్ తన తుది ఫలితాల ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









