జింబాబ్వే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఎమెర్సన్ మనంగఁగ్వా
- August 27, 2018
హరారే: జింబాబ్వే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమర్సన్ మంగాగ్వే ఆదివారం నాడు అధికార బాధ్యతలను స్వీకరించారు. ప్రధానన్యాయమూర్తి లూక్ మలాబా ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారిగా దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మంగగ్వా తాను దేశ రాజ్యాంగానికి, ఇతర చట్టాలకు కట్టుబడి, విశ్వాసపాత్రుడిగా దేశానికి సేవలందిస్తానని ప్రమాణం చేశారు. మంగగ్వా ఎన్నికను సవాలు చేస్తూ ప్రతిపక్ష నేత నెల్సన్ చమిసా దాఖలు చేసిన పిటిషన్ను రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసిన తరువాత మంగగ్వా ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. గత నెల 30న జరిగిన ఎన్నికల్లో మంగగ్వాకు 50.67 శాతం ఓట్లు, ప్రత్యర్థి చమిసాకు 44.3 శాతం ఓట్లు లభించాయని జింబాబ్వే ఎన్నికల కమిషన్ తన తుది ఫలితాల ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







