జింబాబ్వే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఎమెర్సన్ మనంగఁగ్వా
- August 27, 2018
హరారే: జింబాబ్వే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమర్సన్ మంగాగ్వే ఆదివారం నాడు అధికార బాధ్యతలను స్వీకరించారు. ప్రధానన్యాయమూర్తి లూక్ మలాబా ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారిగా దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మంగగ్వా తాను దేశ రాజ్యాంగానికి, ఇతర చట్టాలకు కట్టుబడి, విశ్వాసపాత్రుడిగా దేశానికి సేవలందిస్తానని ప్రమాణం చేశారు. మంగగ్వా ఎన్నికను సవాలు చేస్తూ ప్రతిపక్ష నేత నెల్సన్ చమిసా దాఖలు చేసిన పిటిషన్ను రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసిన తరువాత మంగగ్వా ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. గత నెల 30న జరిగిన ఎన్నికల్లో మంగగ్వాకు 50.67 శాతం ఓట్లు, ప్రత్యర్థి చమిసాకు 44.3 శాతం ఓట్లు లభించాయని జింబాబ్వే ఎన్నికల కమిషన్ తన తుది ఫలితాల ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







