జింబాబ్వే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఎమెర్సన్ మనంగఁగ్వా
- August 27, 2018
హరారే: జింబాబ్వే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమర్సన్ మంగాగ్వే ఆదివారం నాడు అధికార బాధ్యతలను స్వీకరించారు. ప్రధానన్యాయమూర్తి లూక్ మలాబా ఆయనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారిగా దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మంగగ్వా తాను దేశ రాజ్యాంగానికి, ఇతర చట్టాలకు కట్టుబడి, విశ్వాసపాత్రుడిగా దేశానికి సేవలందిస్తానని ప్రమాణం చేశారు. మంగగ్వా ఎన్నికను సవాలు చేస్తూ ప్రతిపక్ష నేత నెల్సన్ చమిసా దాఖలు చేసిన పిటిషన్ను రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసిన తరువాత మంగగ్వా ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. గత నెల 30న జరిగిన ఎన్నికల్లో మంగగ్వాకు 50.67 శాతం ఓట్లు, ప్రత్యర్థి చమిసాకు 44.3 శాతం ఓట్లు లభించాయని జింబాబ్వే ఎన్నికల కమిషన్ తన తుది ఫలితాల ప్రకటనలో వివరించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!







