హైదరాబాద్:20వేల వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ..!
- August 27, 2018
హైదరాబాద్: 'ఎకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమలను పూజించండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి..' అన్న నినాదంతో జీహెచ్ఎంసీ మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ప్టాస్టిక్ నిషేధంపై కసరత్తు ప్రారంభించిన సంస్థ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో జల వనరులు కలుషిత మవుతున్నాయన్న అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 20వేల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని, ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేయడంతోపాటు, కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా పంపిణీ చేపడతామని కమిషనర్ దానకిషోర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







