ఇండోనేషియాలో భూకంపం..

- August 28, 2018 , by Maagulf
ఇండోనేషియాలో భూకంపం..

ఇండోనేషియా:గత కొద్దిరోజులుగా వరుస భూకంపాలతో వణికిపోతున్న ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.
మరోవైపు 18వ ఆసియా క్రీడలకు ఇండోనేషియా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. క్రీడలు జరుగుతున్న జకార్త, పలేంబాగ్ ప్రాంతాలతో టీమర్ ఐస్‌లాండ్, కుపాంగ్‌లలో భూమి కంపించింది. ఈ ఏడాది వరుసగా సంభవించిన భూకంపాల కారణంగా ఇండోనేషియాలో సుమారు 500 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com