కేరళకు 'ARR' భారీ విరాళం
- September 03, 2018
అమెరికా: ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ కేరళకు భారీ విరాళం అందించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. తమ బృందంతో కలిసి కోటి రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచినట్లు పేర్కొన్నారు. రెహమాన్ ఆదివారం తన బృందంతో కలిసి అమెరికాలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళకు సాయం అందిస్తున్న విషయాన్ని వేదికపై ప్రకటించారు. 'నేను, నా ఆర్టిస్టులు అమెరికా టూర్లో పాల్గొన్నాం. కేరళ సోదర సోదరీమణుల కోసం మా వంతు సాయం చేశాం. ఈ చిన్న విరాళం మీకు కాస్త ఊరట ఇస్తుందని ఆశిస్తున్నాం' అని రెహమాన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చెక్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
ఈ టూర్లో భాగంగా ఇటీవల రెహమాన్ కేరళ వరద బాధితులను ఉద్దేశించి పాట పాడారు. 'కేరళ, కేరళ, డోన్ట్ వర్రీ కేరళ' అంటూ ఆ రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెబుతూ పాడిన పాటకు మంచి స్పందన లభించింది. ఈ టూర్ పూర్తి చేసుకుని సెప్టెంబరులో రెహమాన్ భారత్ తిరిగి రానున్నారట. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న 'నవాబ్' సినిమా ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకలో రెహమాన్ ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అనేక మంది సినీ తారలు కేరళకు విరాళాలు అందించారు. షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, రజనీకాంత్, అల్లు అర్జున్, మమ్ముట్టి, ప్రభాస్, చిరంజీవి, రామ్చరణ్, మహేశ్బాబు, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, ధనుష్, నయనతార, విశాల్ తదితరులు విరాళం అందించిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







