ఒమన్‌లో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

- September 21, 2018 , by Maagulf
ఒమన్‌లో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

మస్కట్‌: అల్‌ వుస్తా గవర్నరేట్‌ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ముగ్గుర్ని బలికొంది. అల్‌ వుస్తా హెల్త్‌ గవర్నరేట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. ఒకరికి చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. ఢీకొన్న వాహనాల్లో ఒకటి అగ్ని ప్రమాదానికి గురవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గాయపడ్డవారికి హైమా హాస్పిటల్‌లో వైద్య చికిత్స అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com