పాక్ విదేశాంగ మంత్రితో భేటీ రద్దు చేసిన భారత్

- September 21, 2018 , by Maagulf
పాక్ విదేశాంగ మంత్రితో భేటీ రద్దు చేసిన భారత్

వచ్చే వారం పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో జరగాల్సిన భారత విదేశాంగ మంత్రి భేటీని ఇండియా రద్దు చేసింది. మొదట భారత్, పాక్ మధ్య చర్చల ప్రక్రియను మళ్లీ కొనసాగించాలన్న పాక్ ప్రధాని అభ్యర్థన మేరకు.. రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీకి గురువారం భారత్ అంగీకరించింది. ఇది కేవలం ఓ సమావేశం మాత్రమే అని, చర్చల ప్రక్రియ పునరుద్ధరించినట్లు కాదని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ గురువారం వెల్లడించారు. అయితే జమ్ముకశ్మీర్‌లో రెండు రోజుల వ్యవధిలో ఓ బీఎస్‌ఎఫ్ జవాను, ముగ్గురు పోలీసుల హత్యలు జరగడంతో సమావేశం రద్దు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com