మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

- December 19, 2015 , by Maagulf
మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

 మూడేళ్లలో మంగళగిరిలో ఎయిమ్స్ భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నడ్డా, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. 193 ఎకరాల్లో 1618 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ ను నిర్మించనున్నట్టు జేపీ నడ్డా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com