తీవ్రవాదాన్ని ఏ రూపంలోనూ ఉపేక్షించేది లేదు
- December 19, 2015
ఇంటీరియర్ మినిస్ట్రీ తీవ్రవాదాన్ని తుదముట్టించే చర్యల్లో భాగంగా వ్యక్తులు, సంస్థలు తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి వుంటే తీవ్రమైన చర్యలు తీసుకోబడ్తుందని వెల్లడించింది. తీవ్రవాదులతోగానీ, తీవ్రవాద సంస్థలతోగానీ ఆర్థిక సంబంధాలు నడిపినా, ఆ సంస్థల అండదండలతో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహించినా, తీవ్రవాదాన్ని ప్రతిబింబించే చిహ్నాలు కలిగి వున్నా అలాంటివారిని ఉపేక్షించేది లేదని, చట్టపరంగా తీసుకునే చర్యలకు సంస్థలు, వ్యక్తులు గురికాక తప్పదని ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్ హెజ్బోల్లా ఆఫ్ లెబనాన్, ఫిబ్రవరి 14 యూత్ కోలిషన్, సరే అల్ అష్తర్ మరియు సరయా అల్ మకవామా టెర్రరిస్టు గ్రూపులుగా నిర్ధారించంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తరఫున తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, గల్ఫ్ దేశాల్లో ఎక్కడా తీవ్రవాద ఛాయలు లేకుండా చేయడంలో తమవంతు కృషి చేస్తున్నామని ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. విశ్వ శాంతి కోసం సౌదీ లెడ్ ఇస్లామిక్ మిలిటరీ అలయన్స్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుందని మినిస్ట్రీ చెప్పింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్







