హైదరాబాద్:ఏసుదాస్ ప్రోగ్రాం.. పోస్టర్ ఆవిష్కరించిన కేటీఆర్
- October 03, 2018
మధుర గాత్రంతో ప్రేక్షకుల్ని సంగీత స్వర సాగరంలో ఓలలాడించిన గాన కోవిదుడు కె.జె.ఏసుదాస్. తన మ్యూజికల్ జర్నీలో ఆయన కొన్ని కోట్ల మంది సంగీత ప్రియులను అలరించారు. తెలుగు ప్రేక్షకులను తన పాటలతో అలరించడానికి హైదరాబాద్లో నవంబర్ 11న లైవ్ కాన్సర్ట్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ హీరోయిన్, భరత నాట్యం డాన్సర్ శోభనతో ప్రోగ్రామ్లను నిర్వహించిన ‘11.2’ సంస్థ ఏసుదాస్ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నది . తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తన సినిమాల్లోని హిట్ పాటలను ఈ లైవ్ కనసర్ట్లో ఏసుదాస్ ఆలపించనున్నారు. ఈ లైవ్ కాన్సర్ట్కు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కె.టి.ఆర్ విడుదల చేశారు. నవంబర్ 11 రాత్రి ఏడు గంటలకు జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్ ధర రూ.1200. ఈ టికెట్స్ బుక్ మై షో ద్వారా లభించనున్నట్లు షో నిర్వాహుకులు తెలిపారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









