ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఒమనీ విద్యార్థుల మృతి
- October 11, 2018మస్కట్: ఫ్లోరిడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరు ఒమనీ స్టూడెంట్స్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారని ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్కొంది. మృతి చెందినవారిని మొహమ్మద్ బిన్ సలీమ్ అల్ మషారి, మొహమ్మద్ బిన్ సౌద్ అల్ తోబిగా గుర్తించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ ఇద్దరూ చనిపోయారని మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్కొంటూ, వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని మినిస్ట్రీ తెలిపింది. గాయపడ్డ విద్యార్థి వకాస్ అల్ సియాబీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం