గుమ్మడి గింజలు సేవిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?
- October 16, 2018
గుమ్మడి గింజలు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుటకు ఉపయోగపడుతాయి. మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుటకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. పురుషులకు శృంగార సామర్థ్యన్ని పెంచుతుంది.
గుమ్మడి గింజల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ అల్సర్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. శరీరంలోని వేడిని తగ్గించేందుకు ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. గుమ్మడి గింజలను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా వేడినీళ్లల్లో కలిపి కొద్దిగా ఉప్పు వేసుకుని తీసుకుంటే శరీర వేడి తగ్గుముఖం పడుతుంది.
తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ గింజలతో తయారుచేసిన నూనె వాడితే మంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమి వంటి సమస్యలు తొలగిపోతాయి. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. శరీరానికి కావలసిన మెగ్నిషియం గుమ్మడి గింజల్లో పుష్కలంగా లభిస్తుంది. అందువలన ప్రతిరోజూ ఈ గింజలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







