రష్యాలో బాంబు పేలుడు, 18 మంది మృతి
- October 17, 2018
మాస్కో: రష్యాలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో పది మందికి పైగా గాయపడ్డారు. రష్యాలోని కెర్చ్.. క్రెమియా టెక్నికల్ కాలేజీలో చోటు చేసుకుంది. సంఘటన జరిగిన ప్రాంతం రష్యా బ్రిడ్జి నిర్మించిన క్రెమియా - రష్యా మధ్య ఉంది.
విస్తుపోయారు: చనిపోయిన వ్యక్తి పేరిట అకౌంట్లు, ఖాతాలో రూ.460 కోట్లు
తొలుత దీనిని గ్యాస్ సిలిండర్ పేలుడుగా భావించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా పేలుడుకి పాల్పడినట్లు రష్యాకు చేందిన నేషనల్ గార్డ్స్ ఆ తర్వాత ప్రకటించింది. పేలుడుపై అధికార ప్రతినిధి మాట్లాడారు. ఇది ఐఈడీ కారణంగా జరిగిన పేలుడుగా గుర్తించామని, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామన్నారు.
ఈ పేలుడు కారణంగా మృతి చెందిన వారిలో అత్యధిక మంది విద్యార్థులే. గుర్తుతెలియని సాయుధుడు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర విభాగాలు వెంటనే అక్కడకు తరలి వచ్చాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







