రష్యాలో బాంబు పేలుడు, 18 మంది మృతి
- October 17, 2018మాస్కో: రష్యాలో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో పది మందికి పైగా గాయపడ్డారు. రష్యాలోని కెర్చ్.. క్రెమియా టెక్నికల్ కాలేజీలో చోటు చేసుకుంది. సంఘటన జరిగిన ప్రాంతం రష్యా బ్రిడ్జి నిర్మించిన క్రెమియా - రష్యా మధ్య ఉంది.
విస్తుపోయారు: చనిపోయిన వ్యక్తి పేరిట అకౌంట్లు, ఖాతాలో రూ.460 కోట్లు
తొలుత దీనిని గ్యాస్ సిలిండర్ పేలుడుగా భావించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా పేలుడుకి పాల్పడినట్లు రష్యాకు చేందిన నేషనల్ గార్డ్స్ ఆ తర్వాత ప్రకటించింది. పేలుడుపై అధికార ప్రతినిధి మాట్లాడారు. ఇది ఐఈడీ కారణంగా జరిగిన పేలుడుగా గుర్తించామని, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామన్నారు.
ఈ పేలుడు కారణంగా మృతి చెందిన వారిలో అత్యధిక మంది విద్యార్థులే. గుర్తుతెలియని సాయుధుడు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర విభాగాలు వెంటనే అక్కడకు తరలి వచ్చాయి.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్