జబెల్ జైస్లో గ్రాఫిటీ: 500 దిర్హామ్ల జరీమానా
- October 22, 2018
జబెల్ జైస్లోని రాక్స్పై ఉర్దూలో రాసిన ఓ లవ్ పోయెమ్కి 500 దిర్హామ్ల జరీమానా విధించారు. రస్ అల్ ఖైమా, పబ్లిక్ సర్వీసెస్ డిపార్ట్మెంట్స్ 'రకీబ్' డివిజన్, గ్రాఫిటీ రాతలు, చిత్రాలకు జరీమానా తప్పదని హెచ్చరించడం జరిగింది. జరీమానా ఎదుర్కొన్న గ్రాఫిటీపై ప్రేమకు చిహ్నాలైన హార్ట్ సింబల్స్ని, వాటికి జతగా ఓ బాణాన్నీ, అలాగే ఓ మహిళ ఫేస్నీ చిత్రీకరించినట్లు వివరించింది. జబెల్ జైస్ ప్రాంతంలో ప్రకృతి అందాల్ని చెడగొట్టేలా గ్రాఫిటీ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వుంటుందని అన్నారు. రకెబ్ సూపర్వైజర్ వాయెల్ అలి అబ్దెల్ బారి మాట్లాడుతూ, భారత్ - పాక్ మధ్య స్నేహ సంబంధాల కోసం కొందరు ఇలాంటివి చేస్తున్నట్లు చెప్పారు. ఉద్దేశ్యం మంచిదే అయినా, ఇలాంటి చర్యల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. యూరోపియన్ టూరిస్టులు, తమ పేర్లను, అలాగే డేట్స్ని రాస్తుంటారని ఆయన వివరించారు. నేషనల్ హాలిడేస్, వీక్లీ ఆఫ్ రోజుల్లో ఇలాంటి ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతుంటాయి.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







