జబెల్ జైస్లో గ్రాఫిటీ: 500 దిర్హామ్ల జరీమానా
- October 22, 2018
జబెల్ జైస్లోని రాక్స్పై ఉర్దూలో రాసిన ఓ లవ్ పోయెమ్కి 500 దిర్హామ్ల జరీమానా విధించారు. రస్ అల్ ఖైమా, పబ్లిక్ సర్వీసెస్ డిపార్ట్మెంట్స్ 'రకీబ్' డివిజన్, గ్రాఫిటీ రాతలు, చిత్రాలకు జరీమానా తప్పదని హెచ్చరించడం జరిగింది. జరీమానా ఎదుర్కొన్న గ్రాఫిటీపై ప్రేమకు చిహ్నాలైన హార్ట్ సింబల్స్ని, వాటికి జతగా ఓ బాణాన్నీ, అలాగే ఓ మహిళ ఫేస్నీ చిత్రీకరించినట్లు వివరించింది. జబెల్ జైస్ ప్రాంతంలో ప్రకృతి అందాల్ని చెడగొట్టేలా గ్రాఫిటీ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వుంటుందని అన్నారు. రకెబ్ సూపర్వైజర్ వాయెల్ అలి అబ్దెల్ బారి మాట్లాడుతూ, భారత్ - పాక్ మధ్య స్నేహ సంబంధాల కోసం కొందరు ఇలాంటివి చేస్తున్నట్లు చెప్పారు. ఉద్దేశ్యం మంచిదే అయినా, ఇలాంటి చర్యల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. యూరోపియన్ టూరిస్టులు, తమ పేర్లను, అలాగే డేట్స్ని రాస్తుంటారని ఆయన వివరించారు. నేషనల్ హాలిడేస్, వీక్లీ ఆఫ్ రోజుల్లో ఇలాంటి ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతుంటాయి.
తాజా వార్తలు
- Saud bin Saqr receives Consul-General of Russian Federation
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?







