రైలు పట్టాలు దాటితే జైలే
- October 23, 2018
హైదరాబాద్ : రైలు పట్టాలు దాటినా, ట్రాక్పైకి వచ్చినా కఠిన చర్యలు తప్పవని దక్షిణమధ్యరైల్వే ఓ ప్రకటనలో హెచ్చరించింది. రైల్వేచట్టం 1989 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించేవారిపై సెక్షన్ 147 ప్రకారం ఆరునెలల వరకు జైలు శిక్ష.. రూ.1000 జరిమానా.. లేదంటే రెండూ ఉంటాయని స్పష్టంచేసింది. పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొంది. సురక్షిత ప్రయాణం కోసం ఇటు ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలు రైల్వే నిబంధనల్ని పాటించాలని కోరింది. * రైల్వేస్టేషన్లలో, మార్గమధ్యలో గానీ పట్టాలపైనుంచి వెళ్లొద్దు. స్టేషన్లలో అయితే పాదచారుల వంతెనల ద్వారా ట్రాక్కు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలి. ఇతరచోట్ల సబ్వేలు, రోడ్అండర్బ్రిడ్జిలు, రైల్వేక్రాసింగ్ల ద్వారా దాటాలి.
* రైల్వేట్రాక్ సమీపంలోను, రైలు ఎక్కేటప్పుడు గానీ ఫోన్ వాడొద్దు.
* ట్రాక్ సమీపంలో ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టవద్దు. ట్రాక్పై, సమీపంలో సెల్ఫీలు దిగొద్దు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







