ఇండియా లో హ్యూందాయ్ కొత్త మోడల్ ..
- October 23, 2018
దక్షిణా కోరియా కార్ల దిగ్గజం హ్యూందాయ్ మార్కెట్లోకి మరో సరికోత్త మోడల్ను లాంచ్ చేసింది. ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న హ్యుందాయ్ కొత్త శాంట్రో కారు వచ్చేసింది. ప్రస్తుతం ఈ కారు బడ్జెట్ ధరతో కస్టమర్స్ను ఆకట్టుకుంటోంది. భారత్లో హ్యుందాయ్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో. అయితే కొన్ని కారణాల వలన శాంట్రోను హ్యూందాయ్ మార్కేట్ నుంచి వెనిక్కి తీసుకొంది. వినియోగదారులకు మరో కొత్త మోడల్ను అందించాలని ఉద్దేశంతో బ్రాండ్ న్యూ శాంట్రో కారును హ్యుందాయ్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. మంగళవారం షారుఖ్ ఖాన్తో ఈ కొత్త మోడల్ను
లాంచ్ చేశారు. ప్రారంభ ఆఫర్ కింద తొలి 50,000 మంది కస్టమర్లకు రూ.11,100కే కారును బుక్ చేసుకునే అవకాశాన్ని సంస్థ కలిపించింది.. ఈ సరికొత్త శాంత్రో ధర రూ. 3.7 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.
ఫీచర్లు..
* ఆధునిక హ్యాచ్బ్యాక్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ కారును డిజైన్ చేశారు.
* వెనుక సీట్లలలో కూడా ఏసీ సౌకర్యాన్ని కల్పించారు.
* స్పోర్ట్స్, ఆస్టా రకాల్లో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అందుబాటులో ఉంది.
* ఈ కారులో 4-సిలిండర్ మోటార్తో 1.1లీటర్ ఎప్సిలాన్ ఇంజిన్ ఉంది.
* బీఎస్-6 నిబంధనలకు అనుకూలంగా ఈ కారును రూపొందించారు.
* కారు మైలేజీ లీటర్కు పెట్రోలుతో 20.3 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







