స్పైస్జెట్ ఫెస్టివ్ ఆఫర్, రూ.888 కె టికెట్
- October 26, 2018
ప్రయాణికులను ఆకర్షించేందుకు దేశీయ విమాన సంస్థలు భారీ స్థాయిలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. విమాన ప్రయాణికులకు స్పైస్జెట్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.888 నుంచే డొమెస్టిక్ విమానాల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు స్పైస్జెట్ సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. నవంబరు 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 మధ్య చేసే దేశీయ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. టిక్కెట్ బుక్ చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబరు 28 అని పేర్కొంది. ఇటీవల ఇండిగో సంస్థ దేశీయ ప్రయాణాలకు తమ విమాన టికెట్ల ధరలు రూ.899 నుంచే ప్రారంభమవుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







