346 మంది వలసదారుల అరెస్ట్
- November 12, 2018మస్కట్: 346 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మరో 446 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఓ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 4 నుంచి 11 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్ట్ చేసినవారిలో 169 మంది ఫ్యుజిటివ్ వర్కర్స్ కాగా, 162 మంది ఫ్రీలాన్స్ వర్కర్స్, 15 మంది డాక్యుమెంట్స్ లేని కార్మికులు. క్యాపిటల్ సిటీ మస్కట్లో అత్యధికంగా 111 మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాతి స్థానం నార్త్ బతినా గవర్నరేట్ది. ఇక్కడ 66 మందిని అరెస్ట్ చేశారు. లేబర్ చట్టం ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను 446 మంది కార్మికుల్ని బహిష్కరించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు