నేటి నుంచే 'శ్రీ రామాయణ ఎక్స్ ప్రెస్'... 16 రోజుల పాటు ప్రయాణం

- November 13, 2018 , by Maagulf
నేటి నుంచే 'శ్రీ రామాయణ ఎక్స్ ప్రెస్'... 16 రోజుల పాటు ప్రయాణం

నేటి నుంచి ప్రత్యేక రైలు 'శ్రీ రామాయణ ఎక్స్ ప్రెస్' ప్రారంభం కానుంది. 16 రోజుల పాటు ఈ రైలు ఇండియాలోని పలు ముఖ్యమైన ప్రాంతాలను చుడుతుంది. చివరిగా, యాత్రికులను శ్రీలంకకు కూడా తీసుకెళ్లి, రామాయణంతో ముడిపడిన పుణ్య క్షేత్రాలను దర్శింపజేస్తారు.న్యూఢిల్లీ నుంచి బయలుదేరే ఈ రైలు తొలుత అయోధ్యకు చేరుతుంది. అక్కడి నుంచి హనుమాన్ గార్హి, రామ్ కోట్, కన్ భగవాన్ టెంపుల్, నందిగ్రామ్, సీతామార్హి, జనక్ పూర్, వారణాసి, ప్రయాగ, చిత్రకూట్, నాసిక్, హంపిల మీదుగా రామేశ్వరం వరకూ సాగుతుంది. చెన్నై నుంచి శ్రీలంకకు యాత్రికులను విమానంలో చేరుస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com