బాలుడి మృతి: యూఏఈలో విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- November 14, 2018సౌదీ అరేబియా నుంచి వెళుతున్న ఓ విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. ఉమ్రా ప్రార్థనల అనంతరం తిరిగి వెళుతుండగా, నాలుగేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. విమానం టేకాఫ్ అయిన 45 నిమిషాలకే యహ్యా పుతియాపురాయిల్ ఎపిలెప్టిక్ సీజర్స్కి లోనయ్యాడు. ఈ ఘటనతో విమానాన్ని అబుదాబీలో అత్యవసరంగా దించారు. జెడ్డాలో విమానం ఎక్కే సమయంలో మైల్డ్ ఫీవర్తో బాలుడు బాధపడుతున్నట్లు తెలిపారు మృతుడి అంకుల్. తన తల్లి ఒడిలోనే బాలుడు మృతి చెందినట్లు బాలుడి అంకుల్ మొహమ్మద్ నదీర్ చెప్పారు. నదీర్, అబుదాబీలో నివసిస్తుంటారు. బాలుడి తల్లిదండ్రులు ముహమ్మద్ అలి అల్ జుబైరా కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. యహ్యా అందరికంటే చిన్నవాడు. యహ్యా స్పెషల్ ఛైల్డ్ అనీ, నడవలేడనీ, మాట్లాడలేడనీ నదీర్ తెలిపారు. బాలుడి మృతదేహాన్ని ఎతిహాద్ ఫ్లైట్లో తరలిస్తున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ