బాలుడి మృతి: యూఏఈలో విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- November 14, 2018
సౌదీ అరేబియా నుంచి వెళుతున్న ఓ విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. ఉమ్రా ప్రార్థనల అనంతరం తిరిగి వెళుతుండగా, నాలుగేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. విమానం టేకాఫ్ అయిన 45 నిమిషాలకే యహ్యా పుతియాపురాయిల్ ఎపిలెప్టిక్ సీజర్స్కి లోనయ్యాడు. ఈ ఘటనతో విమానాన్ని అబుదాబీలో అత్యవసరంగా దించారు. జెడ్డాలో విమానం ఎక్కే సమయంలో మైల్డ్ ఫీవర్తో బాలుడు బాధపడుతున్నట్లు తెలిపారు మృతుడి అంకుల్. తన తల్లి ఒడిలోనే బాలుడు మృతి చెందినట్లు బాలుడి అంకుల్ మొహమ్మద్ నదీర్ చెప్పారు. నదీర్, అబుదాబీలో నివసిస్తుంటారు. బాలుడి తల్లిదండ్రులు ముహమ్మద్ అలి అల్ జుబైరా కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. యహ్యా అందరికంటే చిన్నవాడు. యహ్యా స్పెషల్ ఛైల్డ్ అనీ, నడవలేడనీ, మాట్లాడలేడనీ నదీర్ తెలిపారు. బాలుడి మృతదేహాన్ని ఎతిహాద్ ఫ్లైట్లో తరలిస్తున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







