పాన్కార్డ్ కొత్త రూల్..
- November 23, 2018
ఇండియా:ఇంతకు ముందు వార్షిక ఆదాయం రూ.5 లక్షల టర్నోవర్ దాటిన ప్రతి వ్యాపార సంస్థకు పాన్ కార్డ్ తప్పని సరి అనే నిబంధన ఉండేది. తాజా సవరణల ప్రకారం ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చిన సవరణ ప్రకారం ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు తగ్గించారు.
అంటే ఏటా రూ.2.5 లక్షల టర్నోవర్ దాటే ప్రతి వ్యాపారికీ ఇకపై పాన్ కార్డ్ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన డిసెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఇది వ్యాపారస్తులకు మాత్రమే వర్తిస్తుందని తెలియజేసింది. ఇంతకు ముందు చిరు వ్యాపారులకు పాన్ కార్డ్ తప్పనిసరి కాదు.
కొత్త నిబంధన కిందకి వచ్చే వ్యాపారులంతా 2019 మే 31 కల్లా పాన్ కార్డులను పొందాలని ఆదాయపన్ను శాఖ తెలియజేసింది. ఈ నిబంధనల ప్రకారం బోగస్ కంపెనీల బాగోతం బయటపెట్టే వీలుంటుందని ఐటీ శాఖ భావిస్తోంది. తాజా నిబంధనల ప్రకారం పాన్ కార్డు పై తండ్రి పేరు తప్పనిసరి కాదు. తల్లి పేరు చెప్పినా ఆమోదించే సదుపాయం కల్పించినట్టు ఐటీ శాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







