పాన్కార్డ్ కొత్త రూల్..
- November 23, 2018ఇండియా:ఇంతకు ముందు వార్షిక ఆదాయం రూ.5 లక్షల టర్నోవర్ దాటిన ప్రతి వ్యాపార సంస్థకు పాన్ కార్డ్ తప్పని సరి అనే నిబంధన ఉండేది. తాజా సవరణల ప్రకారం ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చిన సవరణ ప్రకారం ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు తగ్గించారు.
అంటే ఏటా రూ.2.5 లక్షల టర్నోవర్ దాటే ప్రతి వ్యాపారికీ ఇకపై పాన్ కార్డ్ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన డిసెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఇది వ్యాపారస్తులకు మాత్రమే వర్తిస్తుందని తెలియజేసింది. ఇంతకు ముందు చిరు వ్యాపారులకు పాన్ కార్డ్ తప్పనిసరి కాదు.
కొత్త నిబంధన కిందకి వచ్చే వ్యాపారులంతా 2019 మే 31 కల్లా పాన్ కార్డులను పొందాలని ఆదాయపన్ను శాఖ తెలియజేసింది. ఈ నిబంధనల ప్రకారం బోగస్ కంపెనీల బాగోతం బయటపెట్టే వీలుంటుందని ఐటీ శాఖ భావిస్తోంది. తాజా నిబంధనల ప్రకారం పాన్ కార్డు పై తండ్రి పేరు తప్పనిసరి కాదు. తల్లి పేరు చెప్పినా ఆమోదించే సదుపాయం కల్పించినట్టు ఐటీ శాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..