సముద్రగర్భంలో హైస్పీడ్ రైళ్లు ... చైనాలో తొలిసారి
- November 23, 2018బీజింగ్: ఎన్నో అద్భుతాలకు వేదికైన చైనాలో తొలిసారి సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించబోతున్నారు. హైస్పీడ్ రైళ్ల కోసం ఈ టన్నెల్ను ఉపయోగించనున్నారు. తూర్పు ప్రావిన్స్ ఝెజియాంగ్లోని రెండు నగరాలను ఇది కలపనుంది. దీనివల్ల ఈ నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న గంటన్నర ప్రయాణ సమయం.. 30 నిమిషాలకు పరిమితం కానుంది. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ మొత్తం పొడవు 70.92 కిలోమీటర్లు కాగా.. అందులో 16.2 కిలోమీటర్ల మేర సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించనున్నారు. ఝెజియాంగ్ ప్రావిన్స్లోని నింగ్బో నగరాన్ని ద్వీప నగరమైన ఝౌషాన్తో కలపనుంది.
ఈ మార్గంలో హైస్పీడ్ రైలు గంటకు గరిష్ఠంగా 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కొత్త ప్రాజెక్ట్తో చైనాలో మొత్తం హైస్పీడ్ రైళ్ల మార్గం పొడవు 25 వేల కిలోమీటర్లకు చేరింది. ప్రపచంలోని మొత్తం హైస్పీడ్ రైళ్ల మార్గంలో 60 శాతం చైనాలోనే ఉండటం విశేషం. చైనాలోనూ ఈ ఝెజియాంగ్ ప్రావిన్స్లోనే తొలిసారి హైస్పీడ్ రైలు మార్గాన్ని లాంచ్ చేశారు. చైనా అభివృద్ధిలో ఈ హైస్పీడ్ రైళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. బీజింగ్-షాంఘైలాంటి రూట్లలో గంటలకు గరిష్ఠంగా 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైళ్లు ఉండటం విశేషం.
ఇండియాలోనూ ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ రైలు కోసం సముద్రగర్భంలో టన్నెల్ నిర్మించనున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..