డిసెంబర్ 7న బెల్లంకొండ శ్రీనివాస్ కవచం విడుదల..
- November 28, 2018
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్ ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా కవచం. ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదల కానుంది. టీజర్ 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకుని.. అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ తో శ్రీనివాస్ మామిళ్ళ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కెరీర్లో తొలిసారి ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కవచం షూటింగ్ పూర్తైంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ సంస్థలో నవీన్ సొంటినేని(నాని) కవచం సినిమాను నిర్మిస్తున్నారు.
నటీనటులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ..
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శ్రీనివాస్ మామిళ్ళ
నిర్మాత: నవీన్ చౌదరి సొంటినేని (నాని)
నిర్మాణ సంస్థ: వంశధార క్రియేషన్స్
సహ నిర్మాత: చాగంటి సంతయ్య
సంగీతం: ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫర్: ఛోటా కే నాయుడు
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: చిన్నా
పిఆర్ఓ: వంశీ శేఖర్
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం







