పెళ్లి పీటలు ఎక్కనున్న శ్వేతా బసు
- November 28, 2018
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో యువతను కొత్త ప్రపంచంలోకి తీసికెళ్ళిన శ్వేతా బసు త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. శ్వేతా బసు చిన్న సినిమాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ రెండేళ్ళ నుండి కలిసి జీవిస్తున్నారు.
ఈ ఏడాదిలో జూన్లో వీరి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. డిసెంబర్ 13న వీరి వివాహం జరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్గా 11 ఏళ్ళ ప్రాయంలోనే హిందీ సినిమా మక్డీ ద్వారా చిత్ర పరిశ్రమలోకి శ్వేతా అడుగు పెట్టింది. సినిమాల్లో ఆమె నటనకు పలు నేషనల్ అవార్డులు వరించాయి. శ్వేతా రీసెంట్గా స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ కూడా జరుపుకుంది. పూణేలో రోహిత్, శ్వేతల వివాహం జరుగనుండగా, ముంబైలో రిసెప్షన్ జరుపుకోనుందట.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







