విమానం గాల్లో ఉండగానే నిద్రపోయిన పైలట్
- November 28, 2018
విమానం గాల్లో ఎగురుతుండగానే ఓ పైలట్ నిద్రపోయాడు. కాస్త కునుకు తీసి మళ్ళీ తేరుకొని ప్రశాంతంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన నవంబర్ 8న జరిగింది. విమానం చేరాల్సిన గమ్యానికి చేరుకోకుండా యాభై కిలోమీటర్లు దూరం ఎక్కువగా ప్రయాణించి ల్యాండ్ అయింది.
దేవన్పోర్ట్ నుంచి టాస్మానియాలోని కింగ్ ఐస్లాండ్ కు ప్రయాణిస్తున్న విమానాన్ని నడుపుతున్న పైలట్కు కాస్త కునుకు పట్టడంతో హాయిగా నిద్రపోయాడు. విమానం కుదుపులకు లోనవడంతో వెంటనే తేరుకొని దాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అందులో ప్రయాణిస్తుంది ఆ పైలట్ ఒక్కడే . ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. విమానం ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్పోర్ట్లో కాకుండా మరో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవడంపై విచారణకు ఆదేశించారు. కింగ్ ఐస్లాండ్ నుంచి మరో 46 కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించిందని ఆస్ట్రేలియా ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో(ఏటీఎస్బీ) తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







