బ్లాక్ మనీ ఖాతాదారుల లిస్ట్ ఇస్తాం
- December 03, 2018
న్యూ ఢిల్లీ: భారతీయులకు సిట్జర్లాండ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. భారతీయుల కల ఈనాటికి నెరవేరే అవకాశాలన్ని స్విస్ ప్రభుత్వం ఇవ్వనుంది. భారతదేశంలో అక్రమంగా సంపాదించిన డబ్బులను అదే అక్రమ రీతిలో విదేశాలను తరలించిన బ్లాక్ మనీ ఖాతాదారుల గుట్టు బైపడునుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం బ్లాక్ మనీ ఖాతాదారుల లిస్ట్ ను వెల్లడించేందుకు నిర్ణయం తీసుకుంది.
నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామనే ఎజెండాతో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ దాదాపు మోదీ ప్రధాని అయిన దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్న బ్లాక్ మనీ తీసుకొచ్చే జాడే కనిపించటంలేదు. దీనిపై విపక్షాలు ఎన్నిమార్లు విమర్శించినా మోదీ నోటి నుండి ఒక్క వివరణగానీ..ఒక్క మాటగానీ రాలేదు. వివరాలు వెల్లడించటం కుదరదని ఇప్పటి వరకూ తెలిపిన స్విస్ బ్యాంక్ ఇప్పుడు హఠాత్తుగా బ్లాక్ మనీ ఖాతాదారుల వివరాలను తెలియజేస్తామనీ..వారి లిస్ట్ ఇస్తామనీ కేంద్ర ప్రభుత్వానికి సమచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పినట్లే. భారతదేశంలో భారీ అక్రమాలకు పాల్పడి.. ఆ సొమ్మును విదేశాలలో నిల్వ చేసుకున్న నల్లవీరుల బండారం బట్టబయలు కానుంది స్విస్ బ్యాంక్ అధికారుల ప్రకటనతో. స్విస్ బ్యాంకు ఖాతాదారుల వివరాలను అందించేందుకు స్విస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. రెండు కంపెనీలు, ముగ్గురు వ్యక్తుల వివరాలు అందించనున్నట్టు స్విస్ ప్రభుత్వం తెలిపింది.
తమిళనాడులోని జియోడెసిక్ లిమిటెడ్, ఆది ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, జియో డెసిక్ కంపెనీ చైర్మన్ పంకజ్ కుమార్ ఓంకార్ శ్రీవాస్తవ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ శరద్ ములేకర్, ఎండీ కిరణ్ కులకర్ణిలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని, వారి వివరాలు కావాలని భారత ప్రభుత్వం స్విస్ ప్రభుత్వాన్ని కోరింది. భారత విజ్ఞప్తిని అంగీకరించిన స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆ వివరాలను అందిస్తామని, వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా పాలనా పరమైన సాయాన్ని భారత్కు అందజేస్తామని స్పష్టం చేసింది. 1982లో ఏర్పాటైన జియోడెసిక్, 2014లో ఏర్పాటైన ఆది ఎంటర్ప్రైజెస్లు ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయా కంపెనీల ప్రమోటర్ల ఆస్తులపై దాడులు చేశారు.
ఈ నేపథ్యంలో మరింతమంది నల్లవీరుల జాబితా బైటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ నల్లడబ్బు భారతదేశానికి తిరిగి వస్తే..భారతదేశపు ఆర్థిక స్థితిగతులు అమోఘంగా మారిపోయే అవకాశం వుంది. ఏది ఏమైనా ఈనాటికైనా స్విస్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి రావటం ఆహ్వానించదగిన విషయం.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









