ఓపెక్కు ఖతర్ గుడ్బై
- December 03, 2018
ఖతర్:ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) నుంచి తాను వైదొలగనున్నట్లు ఖతర్ ప్రకటించింది. జనవరి నుంచి తాము ఒపెక్ నుంచి వైదొలగుతామని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నారు. ముడి చమురు సరఫరాను నియంత్రించేదుకు, తాజా పరిస్థితి చర్చించేందుకు ఒపెక్ దేశాలు ఈ నెల 6వ తేదీన భేటీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖతర్ నిర్ణయం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపర్చింది. ఒపెక్ వెలుపల వల్ల దేశాల మాదిరిగానే తాము కూడా ముడి సరఫరా ఒప్పందాలను అమలు చేస్తామని ఖతర్ పేర్కొంది. ఇప్పటి వరకు ఒపెక్ నిర్ణయాలను గౌరవించి ఉత్పత్తిని కంట్రోల్ చేశామని, ఇక నుంచి ఒపెక్ ఒప్పందాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఖతర్ స్పష్టం చేసింది. తాజా సమాచారం మేరకు ఖతర్ రోజుకు దాదాపు 7 లక్షల బ్యారెళ్ళ ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









