ఓపెక్కు ఖతర్ గుడ్బై
- December 03, 2018
ఖతర్:ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) నుంచి తాను వైదొలగనున్నట్లు ఖతర్ ప్రకటించింది. జనవరి నుంచి తాము ఒపెక్ నుంచి వైదొలగుతామని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నారు. ముడి చమురు సరఫరాను నియంత్రించేదుకు, తాజా పరిస్థితి చర్చించేందుకు ఒపెక్ దేశాలు ఈ నెల 6వ తేదీన భేటీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖతర్ నిర్ణయం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపర్చింది. ఒపెక్ వెలుపల వల్ల దేశాల మాదిరిగానే తాము కూడా ముడి సరఫరా ఒప్పందాలను అమలు చేస్తామని ఖతర్ పేర్కొంది. ఇప్పటి వరకు ఒపెక్ నిర్ణయాలను గౌరవించి ఉత్పత్తిని కంట్రోల్ చేశామని, ఇక నుంచి ఒపెక్ ఒప్పందాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఖతర్ స్పష్టం చేసింది. తాజా సమాచారం మేరకు ఖతర్ రోజుకు దాదాపు 7 లక్షల బ్యారెళ్ళ ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







