ఒక్కనెలలో మార్కెట్లకు విదేశీ పెట్టుబడులు రూ.12.260 కోట్లు
- December 03, 2018
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు నవంబరు ఒక్కమాసంలోనే భారతీయ మూలధన మార్కెట్లకు 12,260 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. గడచిన పది నెలల్లో ఇదే గరిష్టస్థాయి పెట్టుబడులుగా నిపుణులు చెపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురుదరలు పతనం అయినప్పటినుంచి ఇన్వెస్టర్లు భారత్మార్కెట్లపై ఎక్కువ దృష్టిపెట్టారు. అయితే ఇన్వెస్టర్లు డెట్ ఈక్విటీ మార్కెట్లనుంచి సుమారు 60వేల కోట్లు వెనక్కితీసుకున్నారు. గడచిన రెండునెలల్లో ఇంతభారీ మొత్తం విత్డ్రాచేయడం ఇదే మొదటిసారి. అంతకుముందు విదేశీపోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 7300 కోట్లు పెట్టుబడులు పెట్టారు. తాజా గణాంకాలనుచూస్తే విదేశీపోర్టుఫోలియో ఇన్వెస్టర్లు నికరంగా 6913 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లలోను, 5347 కోట్లు డెట్ మార్కెట్లలోపు పెట్టుబడులు పెట్టారు. రూ.12,260 కోట్లు మొత్తంగాపెట్టుబడులు పెట్టారు. జనవరి నెల తర్వాత ఇదే గరిష్టస్థాయి మొత్తంగా చెపుతున్నారు. విదేశీపోర్టుఫోలియో ఇన్వెస్టర్లు జనవరిలోనే 22,240 కోట్ల పెట్టుబడులుపెట్టారు. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు జనవరి మార్చి, జులై ఆగస్టు నెలలు మినహాయిస్తే ఈ నాలుగునెలల్లోను విదేశీ ఇన్వెస్టర్లు 32,వేల కోట్లు పెట్టుబడులుపెట్టారు.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సెప్టెంబరు చివరినుంచి భారీ పెట్టుబడులుపెడుతున్నారు. మొత్తగాచూస్తే 21 వేల కోట్లుపెట్టుబడులుపెట్టారు. అక్టోబరునెలలో కూడా 38,900 కోట్లు విత్డ్రాచేసుకున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచడం, ముడిచమురుధరలుపెరగడం, రూపాయి క్షీణించడం, కరెంటుఖాతాలోటు భారీ లోటుతో నడవడం అనిశ్చితి పెరగడం వంటివి కారణాలుగా చెపుతున్నారు.
విదేశీపోర్టుఫోలియో ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులు భారత్ మార్కెట్లనుంచి ఎక్కువగా సెప్టెంబరు, అక్టోబరునెలల్లోనే ఎక్కువ విత్డ్రాచేసారు. ఈ ఏడాది ఇ్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లురూ.88 వేల కోట్లు మార్కెట్లనుంచి వెనక్కితీసుకున్నారు. రూ.35వేల కోట్లు ఈక్విటీ మార్కెట్లనుంచి రూ.53వేల కోట్లు డెట్మార్కెట్లనుంచి విత్డ్రాచేసారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









