రోడ్డు ప్రమాదం: ముగ్గురు వలసదారుల మృతి
- December 04, 2018
మస్కట్: ఓ వాహన ప్రమాదంలో ముగ్గురు వలసదారులు మృతి చెందగా, మరో వలసదారుడు తీవ్రంగా గాయపడ్డారు. విలాయత్ ఆఫ్ తఖాలో ఈ ప్రమాదం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం మృతులు భారతదేశానికి చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం, స్టేషనరీ ఆబ్జెక్ట్ని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. గాయపడ్డ వ్యక్తిని సుల్తాన్ కబూస్ హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. దోఫార్ గవర్నరేట్ పరిధిలోని తఖాలో ఖష్రూబ్ బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









