రోడ్డు ప్రమాదం: ముగ్గురు వలసదారుల మృతి

- December 04, 2018 , by Maagulf
రోడ్డు ప్రమాదం: ముగ్గురు వలసదారుల మృతి

మస్కట్‌: ఓ వాహన ప్రమాదంలో ముగ్గురు వలసదారులు మృతి చెందగా, మరో వలసదారుడు తీవ్రంగా గాయపడ్డారు. విలాయత్‌ ఆఫ్‌ తఖాలో ఈ ప్రమాదం జరిగింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం మృతులు భారతదేశానికి చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం, స్టేషనరీ ఆబ్జెక్ట్‌ని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. గాయపడ్డ వ్యక్తిని సుల్తాన్‌ కబూస్‌ హాస్పిటల్‌కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. దోఫార్‌ గవర్నరేట్‌ పరిధిలోని తఖాలో ఖష్రూబ్‌ బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com