శ్రీలంకలో ముదిరిన రాజకీయ సంక్షోభం

- December 04, 2018 , by Maagulf
శ్రీలంకలో ముదిరిన రాజకీయ సంక్షోభం

శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రతిష్ఠించిన ప్రధాన మంత్రి మహింద రాజపక్సకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానమంత్రి హోదాలో రాజపక్స ఎలాంటి నిర్ణయాలు తీసుకో వద్దని కోర్టు ఆదేశించింది.

అధ్యక్షుడు సిరిసేన, అక్టోబర్ 26న రణిల్ విక్రమసింఘేను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించి, రాజపక్సను కూర్చోబెట్టారు. అనంతరం, రాజపక్సకు తగిన సంఖ్యలో ఎంపీల మద్దతు లభించే అవకాశం లేకపోవడంతో పార్లమెంటును రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 122 మంది చట్టసభ్యులు, కోర్ట్ ఆఫ్ అపీల్‌ను ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు, రాజపక్స-ఆయన మంత్రివర్గం తమ పదవులకు సంబంధించి ఎలాంటి విధులు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com