శ్రీలంకలో ముదిరిన రాజకీయ సంక్షోభం
- December 04, 2018
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రతిష్ఠించిన ప్రధాన మంత్రి మహింద రాజపక్సకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానమంత్రి హోదాలో రాజపక్స ఎలాంటి నిర్ణయాలు తీసుకో వద్దని కోర్టు ఆదేశించింది.
అధ్యక్షుడు సిరిసేన, అక్టోబర్ 26న రణిల్ విక్రమసింఘేను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించి, రాజపక్సను కూర్చోబెట్టారు. అనంతరం, రాజపక్సకు తగిన సంఖ్యలో ఎంపీల మద్దతు లభించే అవకాశం లేకపోవడంతో పార్లమెంటును రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 122 మంది చట్టసభ్యులు, కోర్ట్ ఆఫ్ అపీల్ను ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు, రాజపక్స-ఆయన మంత్రివర్గం తమ పదవులకు సంబంధించి ఎలాంటి విధులు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!
- KNET లో కొత్తగా డైరెక్ట్ కార్డ్ ఎంట్రీ సిస్టమ్.. పోర్టల్ అప్గ్రేడ్..!!
- ఒమన్ లో డిజిటల్ మీడియాకు లైసెన్సులు తప్పనిసరి..!!
- డైమండ్ హోదాను పొందిన కింగ్ ఫైసల్ హాస్పిటల్..!!
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!









